శ్రీశైలం వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఆర్టీసీ బస్సు టికెట్ కొనుగోలుదారులకు ఆలయ దర్శన టిక్కెట్లను బుక్ చేసుకునే సదుపాయం కల్పించారు. ప్రయాణీకులకు రోజుకు 1,200 దర్శన టిక్కెట్లు అందించబడతాయి.
దీనికి సంబంధించి దేవస్థానం, ఆర్టీసీ మధ్య ఒప్పందం కుదిరింది. స్పర్శ దర్శనం టికెట్ ధర 500 రూపాయలు, అతి శీఘ్రదర్శనం రూ. 300, శీఘ్రదర్శనం రూ.150గా ఉంటుందని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి.హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు ప్రతి 50 నిమిషాలకు ఒక ఏసీ బస్సు, ప్రతి 20 నిమిషాలకు ఓ సూపర్లగ్జరీ బస్సు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ ఆర్ఎం శ్రీధర్ తెలిపారు.
మరోవైపు వారం రోజుల్లో ఏసీ బస్సులు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వేలే ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. JBS నుండి పెద్దలకు 750 రూపాయలు మరియు పిల్లలకు 540 రూపాయలు. ఎంజీబీఎస్ ద్వారా రూ.700, రూ.510గా ఛార్జీలను ఖరారు చేశారు.