సంగారెడ్డి జిల్లాలో ఓ మహిళా మెడికో అనుమానాస్పద స్థితిలో మృతి.
ఖమ్మం జిల్లా మమత మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న రచనా రెడ్డి (25) ప్రస్తుతం బాచుపల్లిలోని మమతా కాలేజీలో ఇంటర్న్షిప్ చేస్తుంది.
అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిష్టారెడ్డిపేట్ ORR (ఔటర్ రింగ్ రోడ్డు)పై కారులో అపస్మారక సిత్థిలో ఉండగా గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు.
పోలీసులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మెడికో రచనా రెడ్డి ప్రాణాలు వదిలింది.