తెలంగాణలో లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎలక్షన్ కమిషన్ అధికారులు ఏర్పాట్లపై దృష్టిసారించారు.
ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించాలని యోచిస్తున్నారు.
సాధారణ పోలింగ్కు నాలుగు రోజుల ముందు గానే ఈ పక్రియను పూర్తి చేయాల్సి ఉండడంతో 8వ తేదీలోగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ను పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో ఈ దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ పత్రాల ముద్రణను నెల 30న మొదలు పెట్టి రెండో తేదీలోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఎన్నికల సంఘం నిర్ణయించినట్టుగా పోస్టల్ బ్యాలెట్ పత్రాలను ఆయా జిల్లాల్లోనే ముద్రించనున్నాయి. కాగా ఈవీఎం యంత్రాలపై ఉంచే బ్యాలెట్ పత్రాలను హైదరాబాద్లోనే ముద్రించాలని అధికారులు నిర్ణయించారు. 85 ఏళ్లు దాటిన వయోవృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.
![](https://tahelkanews.net/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-15-at-5.14.17-PM-1.jpeg)