Breaking News

చంద్రబాబు లౌకికవాదానికి ఐకాన్ వంటి వాడన్న బోర్డు అధ్యక్షుడు షరీఫ్.

దక్షిణ భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వారు తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ సంస్థ అధ్యక్షుడు రషీద్ షరీఫ్ మాట్లాడుతూ చంద్రబాబు లౌకికవాదానికి ప్రతీక అని అన్నారు. మతసామరస్యాన్ని కాపాడడంలో టీడీపీ ముందుందని కొనియాడారు. చంద్రబాబు సామాజిక సమతూకం పాటిస్తున్నారని అన్నారు.
మైనార్టీల అభ్యున్నతికి ఎన్డీయే కూటమి మేనిఫెస్టో దోహదపడుతుందని రషీద్ షరీఫ్ అభిప్రాయపడ్డారు. ముస్లింల అభివృద్ధికి తోడ్పాటునందించే మేనిఫెస్టోకు మేము కృతజ్ఞులం. టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.