Breaking News

రాష్ట్రపతి భవనంలో మాతృదినోత్సవ వేడుకలు.

అంతర్జాతీయ మాతృ దినోత్సవమును పురస్కరించుకొని మే 8వ తేదీన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. హైదరాబాద్ రంగారెడ్డి మరియు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల సంక్షేమ అధికారుల పరిధిలోని వయో వృద్ధాశ్రమాలు మరియు బాలసదన్లు నుండి సుమారు 1600 మంది పాల్గొన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన ఈ వేడుకలు మహిళా వృద్ధులకు చిన్నారులచే పుష్పగుచ్చాలు అందజేశారు. తదుపరి గీతాలాపన మరియు నృత్య ప్రదర్శన వంటి వివిధ సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ జిల్లా సంక్షేమ అధికారి శ్రీ అక్కేశ్వరరావు. రంగారెడ్డి జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి పద్మజా రమణ మరియు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సంక్షేమ అధికారి శ్రీ కృష్ణా రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా వయోవృద్ధులైన 20 మంది మహిళలను సన్మానించడం జరిగింది. జిల్లా సంక్షేమ అధికారులు మాతృమూర్తి యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ అమ్మ మన జీవితంలోని ప్రతిరోజు తోడుగా ఉంటూ మనల్ని నడిపిస్తుందని అన్నారు. మేడ్చల్ -మల్కాజ్గిరి జిల్లా సంక్షేమ అధికారి శ్రీకృష్ణ రెడ్డి మాట్లాడుతూ మాతృ దినోత్సవం కేవలం సంవత్సరంలో ఒకరోజు మాత్రమే కాదని ప్రతి రోజు జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం వృద్ధాశ్రమాలలో ఉంటున్న వృద్ధులు మరియు బాలసదనం లో ఉంటున్న చిన్నారులను అనుసంధానం చేసే విధంగా నిర్వహించడం జరిగింది. రాష్ట్రపతి నిలయం సందర్శన ప్రతి రోజు 5 గంటలకు ఉంటుందని మరియు వారాంతంలో 7 గంటల వరకు ఉంటుందని రాష్ట్రపతి నిలయ అధికారి డాక్టర్ కే. రజనిప్రియ తెలిపారు. తదుపరి కార్యక్రమంలో పాల్గొన్న 1600 మందికి రాష్ట్రపతి నిలయ ఉచిత సందర్శన కల్పించారు.