Breaking News

సరిహద్దుల్లో పాక్ డ్రోన్ల కలకలం. ఆర్మీ కాల్పులు..

జమ్మూకశ్మీర్‌ సరిహద్దుల్లో మరోసారి పాక్‌ డ్రోన్‌లు బీభత్సం సృష్టించాయి. ఈ ఉదయం పూంచ్ జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో పాక్ డ్రోన్లు ఎగురవేశాయి. వారిని గుర్తించిన బలగాలు కాల్పులు జరిపినట్టు అధికారులు తెలిపారు. మెంధార్‌లోని బాల్నోయ్, గుల్పూర్ సెక్టార్ల మీదుగా పాక్ డ్రోన్‌లు కొద్దిసేపటికే ఎగిరాయని చెప్పారు. సైనికులపై కాల్పులు జరిపిన తర్వాత డ్రోన్లు పాకిస్థాన్‌కు తిరిగొచ్చాయని తేలింది.