Breaking News

వయోపరిమితిని 44 నుంచి 46 ఏళ్లకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ పరీక్షకు వయోపరిమితి పెంపుదల కాంగ్రెస్‌లో జరిగింది. దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసి 44 నుంచి 46 ఏళ్లకు పెంచి.. రెండేళ్లపాటు అమలు చేయనున్నట్లు తెలిపింది.

గత ప్రభుత్వం వయోపరిమితిని 34 నుంచి 44 (పదేళ్లు)కి పెంచగా, ఈ ప్రభుత్వం రెండేళ్లు పెంచింది. ఇదిలా ఉంటే మేడిగడ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు మేడిగడ్డకు రావాలని తెలంగాణలోని అన్ని పార్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం లేఖ రాసింది. రేపు మేడిగడ్డ సందర్శనకు రావల్సిందిగా బీఆర్ఎస్, బిజెపి,ఏంఐఎం, సీపీఐ పార్టీ అధ్యక్ష్యులకు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు.